రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల ముందే సమస్యను ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. ఏ బంకు వద్ద కూడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని, సోమవారానికి సరఫరా మెరుగుపడాలని స్పష్టం చేశారు. సాధారణ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక టాస్క్ఫోర్స్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులు, వరికోత యంత్రాలకు డీజిల్ కొరత రాకుండా కూపన్ విధానం అమలు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
![]()

