సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజలు ఆయనను కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. బాధితుల బాధలను ఓపికగా విన్న చంద్రబాబు, వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా త్వరలోనే న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడి భరోసా ఇవ్వడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
![]()




