ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ముంబైలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోనున్నారు. ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం స్వీకరిస్తారు. పారిశ్రామిక సంస్కరణల్లో ఆయన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు వరించింది. ఈ వేడుకకు చంద్రబాబు గౌరవ అతిథిగా హాజరవుతుండగా, దేశీ కార్పొరేట్ దిగ్గజాలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. అధికారుల పర్యటన ఏర్పాట్లు పూర్తి చేశారు.
![]()




