గుజరాత్కు చెందిన శివమ్ మౌర్య ఏఐ సాంకేతికతతో స్వయంచాలకంగా నడిచే ‘ఘోస్ట్ సైకిల్’ను రూపొందించారు. రూ.35,000 వ్యయంతో తయారైన ఈ సైకిల్, రోడ్డుపై తనంతట తానుగా బ్యాలెన్స్ చేసుకుంటూ అడ్డంకులను గుర్తించి ప్రయాణిస్తుంది. స్మార్ట్ఫోన్ లేదా రిమోట్ ద్వారా దీనిని నియంత్రించవచ్చు. పెడల్స్ తొక్కుతున్నట్లు కనిపించే యాంత్రిక వ్యవస్థతో నడిచే ఈ వినూత్న సైకిల్ను చూసి సూరత్ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గతంలోనూ శివమ్ రోబోటిక్ రిక్షా వంటి అనేక వినూత్న పరికరాలను సృష్టించి గుర్తింపు పొందారు.
![]()




