దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం శాఖ తీవ్రంగా ఖండించింది. ఇంధన ధరల పెంపు ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని, ప్రజలు పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, గత నాలుగేళ్లుగా దేశీయంగా ధరలను నియంత్రించిన ఏకైక దేశం భారత్ అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్రం ఇచ్చిన ఈ స్పష్టతతో వాహనదారులు, సామాన్యులకు భారీ ఊరట లభించింది.
![]()




