డిజిటల్ అరెస్టుల పేరుతో విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ మోసాలపై సుప్రీంకోర్టు చేపట్టిన సుమోటో విచారణలో ఆయన మాట్లాడుతూ, బాధితుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత సైబర్ ముఠాల బెయిల్ అభ్యర్థనలను పరిశీలించేటప్పుడు వారి నేరాల తీవ్రతను లోతుగా విశ్లేషించాలని న్యాయస్థానాలకు సూచించారు. మరోవైపు, నేతాజీని ‘దేశ పుత్రుడు’గా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కోర్టు సమయం వృథా చేస్తున్నారంటూ ధర్మాసనం కొట్టివేసింది.
![]()




