తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించి 18 మంది కార్మికులు దుర్మరణం చెందారు. రసాయనాలు కలుపుతున్న సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం కాగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
![]()



