మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజకీయ స్వార్థంతో అడ్డుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాల వైఖరిని ‘భ్రూణ హత్య’తో పోల్చిన ఆయన, మహిళల దశాబ్దాల కలలను చిదిమేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పై విపక్షాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, సంస్కరణలను అడ్డుకోవడమే కాంగ్రెస్ నైజమని ఎద్దేవా చేశారు. తమ హక్కులను కాలరాసిన కుటుంబ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మహిళలే గట్టిగా బుద్ధి చెబుతారని మోదీ హెచ్చరించారు.
![]()



