న్యాయవ్యవస్థలో కృత్రిమ మేధ (AI) కేవలం సహాయకారి మాత్రమేనని, అది మానవ విచక్షణా శక్తికి ప్రత్యామ్నాయం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతకు నైతిక విలువలు, సామాజిక కోణాలు ఉండవని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో మానవ అనుభవమే కీలకమని పేర్కొన్నారు. క్లిష్టమైన కేసుల పరిష్కారంలో ఏఐ సామర్థ్యం సరిపోదని, న్యాయాధికారులు సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే సొంత విచక్షణతో పనిచేయాలని ఆయన సూచించారు.
![]()




