చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బిల్లును అడ్డుకున్న విపక్షాలు జీవితాంతం చింతిస్తాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్షాల మహిళా వ్యతిరేక ధోరణిని గ్రామగ్రామాన ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. కాగా, శుక్రవారం లోక్సభలో జరిగిన ఓటింగ్లో ఈ బిల్లు 298-230 ఓట్ల తేడాతో వీగిపోయింది. విపక్షాలు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు సాకులు వెతుకుతున్నాయని మోదీ విమర్శించారు.
![]()




