డీప్ఫేక్ కంటెంట్ను అరికట్టేందుకు గూగుల్, మెటా, ఎక్స్, రెడ్డిట్ వంటి సంస్థలకు గుజరాత్ హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ మే 8 లోగా వివరణ కోరింది. ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం వల్ల ప్రజా భద్రతకు ముప్పు ఉందని దాఖలైన పిటిషన్పై కోర్టు స్పందించింది. వివాదాస్పద కంటెంట్ను తొలగించేందుకు ప్రభుత్వ ‘సహయోగ్’ పోర్టల్లో చేరాలని ఈ సంస్థలను ఆదేశించింది. ముఖ్యంగా ఎక్స్ (X) వంటి సంస్థలు ప్రభుత్వ నోటీసులకు సరిగ్గా స్పందించడం లేదని కేంద్ర హోం శాఖ ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది.
![]()




