కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, దేశాభివృద్ధి కోసం ప్రజల నుంచి తొమ్మిది కీలక హామీలు తీసుకున్నారు. నీటి పొదుపు, పరిసరాల పరిశుభ్రత, తల్లి పేరుతో మొక్కలు నాటడం, స్వదేశీ వస్తువుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ, రసాయన రహిత సాగు, ఆహారంలో మిల్లెట్ల వినియోగం, నూనె పదార్థాల తగ్గింపు మరియు శారీరక దృఢత్వంపై ప్రమాణం చేయించారు. వీటితో పాటు ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఉచిత వైద్యం అందిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈ నియమాలే కర్ణాటక, భారత్ల వేగవంతమైన వృద్ధికి బాటలు వేస్తాయని ఆయన వెల్లడించారు.
![]()

