అమెరికా-ఇరాన్ యుద్ధ ముగింపు చర్చల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలత ఏర్పడి, భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లు లాభపడి 78,139 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల వృద్ధితో 24,235 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు మార్కెట్ను నడిపిస్తుండగా.. ఐటీ, ఆటో, బ్యాంకింగ్ రంగాలు మెరుగ్గా రాణిస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గి చమురు సరఫరా మెరుగుపడుతుందన్న ఆశలు, దేశీయ రాజకీయ స్థిరత్వ సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి.
![]()




