భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండ అత్యంత విషాదకరమైన ఘట్టం. రౌలట్ చట్టాన్ని నిరసిస్తూ అమృత్సర్లో శాంతియుతంగా సమావేశమైన వేలాదిమంది నిరాయుధులపై జనరల్ డయ్యర్ అమానుషంగా కాల్పులు జరిపించారు. ఈ దురంతంలో వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటన రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును త్యజించేలా చేయడమే కాకుండా, దేశవ్యాప్తంగా జాతీయతను రగిల్చి స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరో మలుపు తిప్పింది.
![]()




