అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీ నుండి ప్రారంభమై ఆగస్టు 28 వరకు 57 రోజుల పాటు కొనసాగుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఈ యాత్రకు సంబంధించి ఏప్రిల్ 15 నుండి దేశవ్యాప్తంగా 554 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. 13 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు గల వారు మాత్రమే అర్హులని, ప్రతి భక్తుడు హెల్త్ సర్టిఫికెట్ మరియు RFID కార్డు కలిగి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. జూన్ 29న తొలి పూజ నిర్వహించనున్నారు. భద్రతా దృష్ట్యా యాత్రికులు ఖచ్చితమైన మార్గదర్శకాలు పాటించాలని బోర్డు సూచించింది.
![]()




