‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలును వేగవంతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 16 నుండి పార్లమెంట్లో ప్రారంభం కానున్న చర్చ నేపథ్యంలో, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆయన ప్రత్యేకంగా లేఖ రాశారు. 2029 లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం సంకల్పించినట్లు ప్రధాని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక సవరణను ఏకగ్రీవంగా ఆమోదించడానికి అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది దేశ గౌరవానికి సంబంధించిన విషయమని, గరిష్ట సంఖ్యలో ఎంపీలు ఈ చర్చలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
![]()




