దేశంలో దూరప్రాంత ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ బెంగళూరు – ముంబై నగరాల మధ్య కొత్త ‘వందేభారత్ స్లీపర్’ రైలును ప్రారంభించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 5న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎంపీ పీసీ మోహన్కు లేఖ ద్వారా స్పష్టతనిచ్చారు. 2026 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 12 కొత్త స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ప్రారంభించిన కామాఖ్య – హౌరా స్లీపర్ రైలు 100 శాతం ఆక్యుపెన్సీతో సూపర్ హిట్ కావడంతో, ఈ కొత్త సర్వీసుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు 9.1 కోట్ల మంది ప్రయాణికులు వందేభారత్ సేవలను వినియోగించుకోవడం విశేషం.
![]()




