ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2026-30’ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ విధానం ద్వారా 2030 నాటికి మెజారిటీ వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ప్రకారం ఈ-టూవీలర్లపై ₹30,000, ఆటోలపై ₹50,000, గూడ్స్ వాహనాలపై ₹1,00,000 వరకు నగదు ప్రోత్సాహకాలు అందించనుంది. పాత వాహనాలను స్క్రాపింగ్ చేసి కొత్త ఈవీ కొంటే కార్లపై ₹1,00,000 అదనపు రాయితీ లభిస్తుంది. అలాగే ₹30 లక్షల లోపు విలువైన ఈవీలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి పూర్తి మినహాయింపు కల్పించారు.
![]()




