సాగర్ రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అదుపుతప్పిన కారు ఒక బైక్ను, నడిచి వెళ్తున్న యువకుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహావీర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు శివ, సందీప్తో పాటు మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు కారు డ్రైవర్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![]()




