పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా భారత్ నుండి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు భారీగా రద్దయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 10 వేల సర్వీసులు నిలిచిపోయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. రోజువారీ సర్వీసులు 350 నుండి ఏకంగా 90కి పడిపోయాయి. ఈ సంక్షోభ సమయంలో విమాన కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, పైలట్ల విధులకు సంబంధించి ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనలను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది.
![]()




