విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొదట, పార్టీ తర్వాత అనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని, విచ్ఛిన్నకర రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు సాకారమయ్యాయని గుర్తుచేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్నామని, ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని పిలుపునిచ్చారు.
![]()



