అంతర్జాతీయ మార్కెట్లో ఆహార వస్తువుల ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్ఏఓ (FAO) వెల్లడించింది. మార్చి నెలలో ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 128.5 పాయింట్లకు చేరడం గడిచిన ఏడు నెలల్లోనే అత్యధికం. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇంధన, ఎరువుల ధరలు పెరగడమే ఈ పరిస్థితికి కారణమని నివేదిక పేర్కొంది. చక్కెర ధరలు 7.2%, వెజిటబుల్ ఆయిల్స్ 5.1%, గోధుమలు 4.3% పెరగగా, బియ్యం ధరలు మాత్రం స్వల్పంగా 3% తగ్గాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు సాగు తగ్గి ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
![]()




