మున్సిపల్ పీఠాలను దక్కించుకున్న బీఆర్ఎస్రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చైర్మన్గా టేకుల సుదర్శన్రెడ్డి, వైస్ చైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. అలాగే మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్గా సీపీఐ అభ్యర్థి సరిత విజయం సాధించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మరోవైపు ఖానాపూర్లో చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మరియు అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రక్రియలో వివాదాలు తలెత్తాయి.
![]()




