చండీగఢ్లోని పంజాబ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి కలకలం రేపింది. ఈ ఘటనలో సమీప భవనాల అద్దాలు ధ్వంసమవ్వగా, ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. భద్రతా పరంగా అత్యంత కీలకమైన ప్రాంతంలో పేలుడు జరగడంతో పోలీసులు నగరం అంతటా హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేశారు.
![]()




