నైతిక బాధ్యతను చట్టపరమైన విధిగా పరిగణించలేమని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు వృద్ధ దంపతుల భరణం పిటిషన్ను కొట్టివేసింది. మరణించిన కానిస్టేబుల్ తల్లిదండ్రులు తమ కోడలి నుంచి భరణం కోరగా, బీఎన్ఎస్ సెక్షన్ 144 ప్రకారం అత్తమామలు భరణానికి అర్హులు కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ సెక్షన్ కేవలం భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మాత్రమే రక్షణ కల్పిస్తుందని, చట్టంలో లేని నిబంధనలను నైతికత ప్రాతిపదికన అమలు చేయలేమని ధర్మాసనం తీర్పునిచ్చింది. దీంతో దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థించింది.
![]()




