
దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. హోదాల రద్దు కంటే దేశంలో అసమానతలకు కారణమైన కుల వ్యవస్థనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, అవి వివక్షతో కూడుకున్నవని విమర్శించారు. కుల వ్యవస్థ వల్ల దళితులే అత్యంత బాధితులని ఆవేదన వ్యక్తం చేస్తూ, దీని రద్దుపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.
![]()



