కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల అవినీతి పాలనకు అంతం పలికి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాలక్కడ్ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని దోచుకుంటూ ఆర్థిక వ్యవస్థను రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే అవినీతిపరుల నుండి నిధులు రికవరీ చేసి అభివృద్ధికి ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
![]()




