పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ఇంధన, నిత్యావసరాల కొరత తలెత్తకుండా ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర వీడియో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాలు ‘టీమ్ ఇండియా’లా కలిసి పనిచేసి ఆర్థిక స్థిరత్వం, ఇంధన భద్రతకు అగ్ర ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఎరువుల సరఫరా, ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. అక్రమ నిల్వలను అరికట్టి, ప్రజల్లో భయాందోళనలు కలగకుండా చూడాలన్నారు. ఈ భేటీలో పాల్గొన్న ఏపీ, తెలంగాణ సీఎంలు కేంద్రానికి పూర్తి మద్దతు ప్రకటించి, తమ రాష్ట్రాల్లో తీసుకుంటున్న ముందస్తు భద్రతా జాగ్రత్తలను ప్రధానికి వివరించారు.
![]()




