కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ సమాచారాన్ని నియంత్రించేందుకు ఐటీ చట్టానికి చేసిన సవరణల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. 2023లో తెచ్చిన ఈ సవరణలు రాజ్యాంగ వ్యతిరేకమన్న బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అయితే, హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. సామాజిక మాధ్యమాల్లోని తప్పుడు సమాచారాన్ని నియంత్రించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొనగా, సవరణల్లో స్పష్టత లేదని […]
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ సమాచారాన్ని నియంత్రించేందుకు ఐటీ చట్టానికి చేసిన సవరణల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. 2023లో తెచ్చిన ఈ సవరణలు రాజ్యాంగ వ్యతిరేకమన్న బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అయితే, హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. సామాజిక మాధ్యమాల్లోని తప్పుడు సమాచారాన్ని నియంత్రించడమే తమ ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొనగా, సవరణల్లో స్పష్టత లేదని ప్రతివాదులు వాదించారు. నాలుగు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.