తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం నెరబైలు అటవీ ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురై రెండు ఏనుగులు మరణించాయి. అడవి పందుల నివారణకు రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం మృతదేహాలను గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మూగజీవాల మృతిపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![]()

Leave a Reply Cancel reply