హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో ఆయన మాట్లాడుతూ, జిల్లా లేదా హైకోర్టుల పరిధిలో అర్హులైన మహిళా న్యాయమూర్తులు లేనప్పుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఆయా రాష్ట్రాల మహిళా న్యాయవాదులను పరిగణనలోకి తీసుకోవాలని కొలీజియంలకు సూచించారు. న్యాయవ్యవస్థలో ఇంకా సమాన ప్రాతినిధ్యం సాకారం కాలేదని, ప్రతిభావంతులైన మహిళలను ఉన్నత పదవులకు ఎంపిక చేసే మార్గాలను సుగమం చేయాలని స్పష్టం చేశారు.
![]()

Leave a Reply Cancel reply