తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి నూతన భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులతో కలిసి నూతన భవన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలిలోని తన గదిలో సీఎం పూజలు నిర్వహించారు. అనంతరం సెంట్రల్ హాల్ ఏర్పాటుపై అధికారులతో చర్చించి, కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
![]()

Leave a Reply Cancel reply