Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
National

ఆపరేషన్‌ సిందూర్‌పై విదేశీ మీడియా తప్పుడు ప్రచారం — దోవల్ ఘాటు స్పందన

TwitterWhatsAppFacebookTelegramShare

ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌ దాడుల వల్ల భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఖండించారు. దేశ రక్షణపై అనవసరంగా అపోహలు కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తీవ్రంగా స్పందించారు. భారత్‌ తగిన సాంకేతిక సమాచారంతోనే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, స్వదేశీ రక్షణ సాంకేతికతతో ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని వివరించారు. దోవల్ పాకిస్థాన్‌ […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

పరేషన్‌ సిందూర్‌ సందర్భంలో పాకిస్థాన్‌ దాడుల వల్ల భారత్‌కు నష్టం జరిగిందని విదేశీ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ ఖండించారు. దేశ రక్షణపై అనవసరంగా అపోహలు కలిగించేలా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన తీవ్రంగా స్పందించారు. భారత్‌ తగిన సాంకేతిక సమాచారంతోనే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని, స్వదేశీ రక్షణ సాంకేతికతతో ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని వివరించారు.

దోవల్ పాకిస్థాన్‌ వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్‌ క్షిపణుల దాడి వివరించడంతో పాటు, భారత్‌కు నష్టం జరిగిందని ఎవరైనా అంటే దాన్ని రుజువు చేసే ఒక్క ఆధారం చూపాలని సవాలు విసిరారు. పాకిస్థాన్‌ దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్-11 బాలిస్టిక్ క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్-400’తో సమర్థంగా నిష్క్రియంచేశామని తెలిపారు.

దేశ భద్రత కోసం కేంద్రం ఆత్మనిర్భర్ భారత్‌ ద్వారా రక్షణ సామగ్రిని స్వదేశీ పద్ధతిలో తయారు చేస్తోందని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సాంకేతిక సత్తాకు నిదర్శనమని డోభాల్‌ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version