TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌ కొత్తగూడెం జిల్లా రామవరంలో విజయవంతంగా ముగిసింది. అథ్లెటిక్స్‌లో పాల్గొన్న పిల్లలకు డివైఎస్‌వో పరంధామరెడ్డి, ఐఎన్టీయూసి వైస్‌ప్రెసిడెంట్ ఎండి రజాక్, ఎంఎంటీఐ సీఐ సుధాకర్ రావు ప్రధాన అతిథులుగా హాజరై టీషర్ట్లను పంపిణీ చేశారు. ఈ క్యాంప్‌ను కోచ్ రియాజ్ పాష ఆధ్వర్యంలో నిర్వహించగా, రామవరం వ్యాపారులు నజీర్, జాకీర్, సుభాష్‌ టీషర్టుల స్పాన్సర్‌గా నిలిచారు. జిల్లాలో గ్రామీణ స్థాయిలో మరిన్ని పిల్లలు అథ్లెటిక్స్‌లో పాల్గొనడం సంతోషకరమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సంఘాల నాయకులు, ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కోచ్ మల్లికార్జున్, రియాజ్ పాష కృషిని కొనియాడుతూ వారిని అభినందించారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version