నిరుద్యోగుల కోసం అధునాతన రీడింగ్‌ రూమ్స్‌ – ఐటీడీఏ పీఓ రాహుల్

TwitterWhatsAppFacebookTelegramShare

నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధమయ్యేలా ఆధునాతన హంగులతో రీడింగ్‌ రూమ్స్‌ను నిర్మిస్తున్నట్లు ఐటీడీఏ పీ.ఓ బి. రాహుల్ తెలిపారు. భద్రాచలం తాతగుడి సెంటర్‌లోని గ్రంథాలయాన్ని గురువారం సందర్శించిన ఆయన, రీడింగ్‌ రూమ్స్‌ నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు.

రీడింగ్‌ రూమ్ విశేషాలు:

  • వంద మంది ఒకేసారి చదువుకునేలా ప్రత్యేక హాల్
  • తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్‌ సౌకర్యం
  • టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటు
  • నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాల లభ్యత

ఈ కార్యక్రమంలో ఈఈ చంద్రశేఖర్‌, డి. హరీష్‌, టీఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

‘యువ వికాసం’ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గిరిజన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ఉపయోగించుకోవాలని పీ.ఓ రాహుల్ సూచించారు.

  • దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత కార్యాలయాల్లో ఏప్రిల్ 14 లోపు సమర్పించాలి.
  • ప్రచారం: నిరుద్యోగులందరికీ సమాచారం చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version