📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 485,809  |  452 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతిLatest Breaking News from PressMeetతాజా వార్తలువాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుపాటియాలాలో భారీ పేలుడు: రైల్వే ట్రాక్ సమీపంలో వ్యక్తి మృతి

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం

March 25, 2025 March 25, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ, పాల్వంచ మున్సిపాలిటీ, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దీనిని ప్రకటించారు. శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు కార్పొరేషన్ సాధనకు చేసిన కృషిని గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుతో పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని కూనంనేని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బొగ్గు, విద్యుత్, అటవీ, ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని తెలిపారు. పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికలకు అడ్డంకులు తొలిగిపోయాయని, ప్రజలకు కార్పొరేషన్ రూపంలో అభివృద్ధి ఫలాలు అందించినందుకు హర్షం వ్యక్తమవుతోందన్నారు

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *