Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Uncategorized

పరిశీలనలో న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోంది. న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచడంతో పాటు హౌసింగ్, సంక్షేమ పథకాలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం, న్యాయవాదుల సంక్షేమ గుమస్తాల చట్ట సవరణపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగి, రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ప్రధాన అంశాలు: స్టాంప్ విలువ పెంపు: బార్ కౌన్సిల్ తీర్మానాల మేరకు […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పరిశీలిస్తోంది. న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచడంతో పాటు హౌసింగ్, సంక్షేమ పథకాలపై కూడా ఆలోచన చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం, న్యాయవాదుల సంక్షేమ గుమస్తాల చట్ట సవరణపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగి, రెండు బిల్లులు ఆమోదం పొందాయి.

ప్రధాన అంశాలు:

స్టాంప్ విలువ పెంపు: బార్ కౌన్సిల్ తీర్మానాల మేరకు స్టాంప్ విలువను రూ.100 నుంచి రూ.250కి పెంచడంపై శాసనసభ ఆమోదం తెలిపింది. హైకోర్టు అభివృద్ధి: 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి నిధుల కేటాయింపు. ప్రత్యేక లా యూనివర్సిటీ: హైకోర్టు భవన్ ఆవరణలో 10 ఎకరాల్లో లా యూనివర్సిటీ ఏర్పాటుకు పరిశీలన. వివిధ వర్గాల న్యాయవాదుల సంక్షేమం: ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయవాదులకు ఇంటి స్థలాలు, స్కాలర్‌షిప్, హెల్త్‌కార్డులు, పెన్షన్ సదుపాయాలపై చర్చ. న్యాయవాదుల భద్రత: కేసులు వాదించే సమయంలో దాడులకు గురయ్యే న్యాయవాదుల రక్షణపై చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనల అమలుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version