📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Friday, September 11, 2026
Visitors: 1,773,713  |  714 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీLatest Breaking News from PressMeetతాజా వార్తలుకాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు మ్యాపింగ్ ఉద్యోగాలుపిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన 26 ఏళ్ల వ్యక్తికి షాక్.. శరీరంలో గర్భాశయం!సెప్టెంబర్ 11, 9/11 దాడులు: ప్రపంచాన్ని మార్చిన విషాదకరమైన రోజుబ్రిక్స్‌ సదస్సుకు దిల్లీ సర్వసన్నద్ధం.. 15 వేల మంది పోలీసులతో భారీ భద్రతఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ప్రత్యేక యాప్‌.. 10 నిమిషాల్లోనే నిత్యావసరాల డెలివరీ

కొత్తగూడెం క్లబ్‌లో అవకతవకలపై కలెక్టర్ కు గిరిజన సంఘాల ఫిర్యాదు

February 3, 2025 February 3, 2025 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా గిరిజన సంఘ నాయకులు కొత్తగూడెం క్లబ్‌లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేశారు. పూర్తిగా గిరిజనులు నివసించే ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం జిల్లాలో, సింగరేణి, ప్రభుత్వ సహాయంతో స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ క్లబ్, క్యాంటీన్‌ను కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం అక్రమంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఈ క్లబ్‌ను ఫంక్షన్ హాల్‌గా మార్చి, కొత్త వారికి సభ్యత్వం ఇవ్వకుండా, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిర్లక్ష్యం చేస్తూ, పేదలకు అందని విధంగా లక్షల నుంచి రెండు లక్షల వరకు కిరాయిలు పెంచారని తెలిపారు. క్లబ్ నిర్వహణలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నూతన కమిటీలో ఎస్సీ, ఎస్టీలకు స్థానం లేకపోవడంతో దాన్ని రద్దు చేసి, ప్రభుత్వం లేదా సింగరేణి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మూడు బాలాజీ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోతు శివ నాయక్, లావుడియా ప్రసాద్ నాయక్, బానోతు దుర్గాప్రసాద్, బట్టు అరుణ్ నాయక్, అశోక్ బాబు నాయక్, జరుపుల లచ్చు నాయక్, భూక్య దేవ్ సింగ్ నాయక్, ధారావత్ రామ్నాథ్ నాయక్, రాంబాబు నాయక్, శ్రీనివాస్ నాయక్, ప్రతాప్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Loading

 Save as PDF

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *