Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Andhra

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: ఆంధ్రప్రదేశ్ లో దంచికొట్టనున్న వర్షాలు

TwitterWhatsAppFacebookTelegramShare

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటన ప్రకారం, నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడే సూచనలు ఉన్నా, రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాల ప్రభావం కనిపిస్తుంది. వర్షాల శ్రేణి: డిసెంబర్ 25, బుధవారం:శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ప్రకటన ప్రకారం, నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడే సూచనలు ఉన్నా, రాష్ట్రంలో రాగల మూడు రోజులు వర్షాల ప్రభావం కనిపిస్తుంది.

వర్షాల శ్రేణి:

డిసెంబర్ 25, బుధవారం:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు.

డిసెంబర్ 26, గురువారం:
నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు. కర్నూలు, వైఎస్ఆర్, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.

డిసెంబర్ 27, శుక్రవారం:
ప్రకాశం, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.

రైతులు, ప్రజల కోసం సూచనలు:

  • వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
  • ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలి.

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను పరిగణనలో ఉంచుకుని స్థానిక అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version