📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,251  |  483 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు

విద్యా రంగంపై అసెంబ్లీలో చర్చ: సర్కార్‌పై ఘాటు విమర్శలు

December 18, 2024 December 18, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, విద్యా రంగ అభివృద్ధి ప్రతీ ప్రభుత్వ లక్ష్యం కావాలని, కానీ కేసీఆర్‌ ప్రాథమిక అంచనాలు మారిపోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్స్‌ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో మార్పుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. అయితే పైనుంచి కింది స్థాయి వరకు ఆచరణ ఉండాలన్నారు.

ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, పేదలకు విద్యను అందించకుండా ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. పేదలు తమ ఆదాయంలో 90% విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతపై ప్రశ్నిస్తూ, గడిచిన ఏడాది 1000 మంది గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరి, 40 మంది మరణించారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *