📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Saturday, June 13, 2026
Visitors: 1,039,685  |  403 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లుLatest Breaking News from PressMeetతాజా వార్తలుచీకటి బతుకుల్లో వెలుగుల కోసం.. ప్రధానికి రక్తాక్షరాల లేఖలు!బడికి వెళ్లాల్సిన బాల్యం.. బానిసత్వంలో మగ్గాలా?హౌస్‌వైఫ్ కాదు ‘దేశ నిర్మాత’: గృహిణుల సేవలకు సుప్రీంకోర్టు గౌరవంజమ్మూకశ్మీర్: అడవుల్లో ఉగ్రవాదుల కాంక్రీట్ బంకర్లు.. పేల్చివేసిన భద్రతా బలగాలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు: ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత.. కుప్పకూలిన మార్కెట్లు

మాచినేనిపేటతండా యువతి హత్య కేసు నిందితుల అరెస్టు : కొత్తగూడెం డీఎస్పీ

November 15, 2024 November 15, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మాచినేనిపేటతండాలో సంచలనం కలిగించిన యువతి హత్య కేసుకు సంబంధించి నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్ధుల్‌ రెహమాన్‌తో కలిసి జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మాచినేనిపేట తండాలో హత్యకు గురైన తోట స్వాతి కేసులో అదే గ్రామానికి చెందిన బానోత్‌ భద్రం, అతని తల్లి సరోజను వారి ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భద్రం, తనతో సహజీవనం చేస్తున్న స్వాతిని హత్య చేసిన తర్వాత, ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు అతని తల్లి సరోజ గదిలోని రక్తం మరకలను తుడిచివేయడం, మృతదేహాన్ని పత్తిచేలో గుంతలో పూడ్చిపెట్టేందుకు సహకరించినట్లు తెలిపారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *