📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,253  |  483 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు

మాచినేనిపేటతండా యువతి హత్య కేసు నిందితుల అరెస్టు : కొత్తగూడెం డీఎస్పీ

November 15, 2024 November 15, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

మాచినేనిపేటతండాలో సంచలనం కలిగించిన యువతి హత్య కేసుకు సంబంధించి నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్ధుల్‌ రెహమాన్‌తో కలిసి జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మాచినేనిపేట తండాలో హత్యకు గురైన తోట స్వాతి కేసులో అదే గ్రామానికి చెందిన బానోత్‌ భద్రం, అతని తల్లి సరోజను వారి ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భద్రం, తనతో సహజీవనం చేస్తున్న స్వాతిని హత్య చేసిన తర్వాత, ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు అతని తల్లి సరోజ గదిలోని రక్తం మరకలను తుడిచివేయడం, మృతదేహాన్ని పత్తిచేలో గుంతలో పూడ్చిపెట్టేందుకు సహకరించినట్లు తెలిపారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *