మాచినేనిపేటతండా యువతి హత్య కేసు నిందితుల అరెస్టు : కొత్తగూడెం డీఎస్పీ

TwitterWhatsAppFacebookTelegramShare

మాచినేనిపేటతండాలో సంచలనం కలిగించిన యువతి హత్య కేసుకు సంబంధించి నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్ధుల్‌ రెహమాన్‌తో కలిసి జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మాచినేనిపేట తండాలో హత్యకు గురైన తోట స్వాతి కేసులో అదే గ్రామానికి చెందిన బానోత్‌ భద్రం, అతని తల్లి సరోజను వారి ఇంటి వద్ద అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భద్రం, తనతో సహజీవనం చేస్తున్న స్వాతిని హత్య చేసిన తర్వాత, ఆనవాళ్లు కనిపించకుండా చేసేందుకు అతని తల్లి సరోజ గదిలోని రక్తం మరకలను తుడిచివేయడం, మృతదేహాన్ని పత్తిచేలో గుంతలో పూడ్చిపెట్టేందుకు సహకరించినట్లు తెలిపారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version