Saturday, March 14, 2026
f t y in
Breaking
ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ: చట్టానికి కొత్త మెరుగులు నిష్కళంక దేశభక్తుడు శ్రీ హెచ్. జె. దొర: ఒక శకం ముగింపు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన: భారత చరిత్రలో మొదటిసారి ప్రజా వాణి ఆన్‌లైన్ వేదిక: సామాన్యుడి ముంగిట ప్రభుత్వ సేవలు అవిశ్వాస తీర్మానం వీగిపోయింది: లోక్‌సభలో ఉత్కంఠకు తెర వాణిజ్య గ్యాస్ సంక్షోభం: ఫుడ్ డెలివరీ రంగంపై పిడుగు యూపీఐ ఏటీఎం: భారత బ్యాంకింగ్ రంగంలో నవశకం ప్రజా గొంతుకగా రాఘవ్ చద్దా: పార్లమెంటులో సామాన్యుడి పోరాటం మాల మహానాడు భద్రాద్రి జిల్లా యూత్ వింగ్ అధ్యక్షుడిగా పసుపులేటి పవన్ ఐటీ చట్ట సవరణలపై సుప్రీంకోర్టులో కేంద్రం అప్పీల్
Advertisement 728×90
Khammam

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు : కలెక్టర్ జితేష్

TwitterWhatsAppFacebookTelegramShare

కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్యుల అర్హతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే అర్హతలకు మించి వైద్యం చేస్తున్న వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఆసుపత్రులలో పనిచేసే వైద్యులపై […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో వైద్యులపై దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, వైద్యుల అర్హతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అలాగే అర్హతలకు మించి వైద్యం చేస్తున్న వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇప్పటివరకు ఆసుపత్రులలో పనిచేసే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు అవసరమని సూచించారు. ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తక్షణం తరలించి వైద్యం అందించాలని, ప్రమాదకర ప్రాంతాల జియో ట్యాగింగ్ చేయాలని కోరారు. డాక్టర్ భాస్కర్ నాయక్, జిల్లా వైద్య అధికారి, రక్త పరీక్ష కేంద్రాల్లో పరీక్షల ధరల వివరాలను ప్రజలకు తెలిసేలా ఆసుపత్రులలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు అరికల భాస్కర్, అనుమతులు లేని ఆసుపత్రులు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డా. మధువరన్, డిప్యూటీ DMHO ఫైజ్ మొహియుద్దీన్, ఉమా మహేశ్వరి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version