సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు తొలగింపు

TwitterWhatsAppFacebookTelegramShare

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం ప్రస్తుతం విశేషంగా చర్చనీయాంశమైంది. సంప్రదాయంగా న్యాయదేవత విగ్రహాన్ని కళ్లకు గంతలు కట్టిన రూపంలో చూసి ఉంటాం, అది “చట్టం గుడ్డిది” అనే భావనను ప్రతిబింబిస్తుంది, అంటే చట్టం ముందుకు ఎవరైనా సమానమే అనే సిద్ధాంతం. అయితే, సుప్రీం కోర్టు తాజా విగ్రహంలో న్యాయదేవత కళ్లకు ఉన్న గంతలు తొలగించి, ఆమె ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా భారత రాజ్యాంగాన్ని ఉంచారు.

ఈ మార్పులు చట్టానికి కొత్త వర్ణనను అందిస్తోందని, “చట్టం గుడ్డిది కాదు” అనే భావనను స్పష్టంగా తెలియజేస్తున్నాయని అనుకుంటున్నారు. చట్టం కేవలం న్యాయం మాత్రమే కాకుండా, రాజ్యాంగపరమైన విలువలను, నియమాలను అనుసరించే సామర్థ్యం కలిగి ఉందనే సందేశం ఈ విగ్రహం ద్వారా అందిస్తున్నట్టు భావిస్తున్నారు.

ఈ ప్రతిష్ఠాపనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు, కొందరు ఈ మార్పు ద్వారా చట్టం సరైనంగా కళ్లుచూడగలదని, రాజ్యాంగం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుందని సంతోషిస్తున్నారు. మరోవైపు, చట్టం సమానత్వానికి ప్రతీక అయిన గంతలు తొలగించడంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version