Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Khammam

కొత్తగూడెం ఏరియాలో జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్న ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ త్యాగరాజు ,వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్

TwitterWhatsAppFacebookTelegramShare

బుధవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిధిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు పాల్గొన్నారు, త్యాగరాజు , రజాక్ మాట్లాడుతూ గడిచిన 2023- 24 వార్షిక సంవత్సరముల లాభాల వాటను 33% గా సింగరేణి కార్మికులకు ఇచ్చే విధంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, వారితోపాటు ఉప ముఖ్యమంత్రి […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

బుధవారం రోజున కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు ఫిట్ కార్యదర్శి ఎం.డి సత్తార్ పాష ఆధ్వర్యంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో ముఖ్య అతిధిగా జనరల్ సెక్రెటరీ త్యాగరాజు పాల్గొన్నారు, త్యాగరాజు , రజాక్ మాట్లాడుతూ గడిచిన 2023- 24 వార్షిక సంవత్సరముల లాభాల వాటను 33% గా సింగరేణి కార్మికులకు ఇచ్చే విధంగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, వారితోపాటు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు, సీ.ఎన్.ఎండి ఎన్.బలరాం నాయక్, ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్, కోల్ బెల్ట్ శాసన సభ్యులు అలాగే గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు, గత ప్రభుత్వం సింగరేణి లాభాల వాటాను కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి లాభాలను కార్మికులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా 33% బోనస్ పెంచడంతోపాటు మిగతా లాభాలను కార్మిక కుటుంబాల కోసం సింగరేణి విస్తరణ కోసం ప్లాన్ చేస్తున్నది,లాభాలను శ్వేత పత్రం వలె క్లియర్ గా అందరికి అర్థమయ్యేలా వివరించడం జరిగింది,

అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు 25 వేల పైచిలుకు మందికి 5000 చొప్పున లాభాల వాటా ప్రకటించడం శుభ పరిణామం అని అందుకు కృషి చేసిన ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ కు ఔట్సోర్సింగ్ కార్మికులు అభినందనలు తెలియజేశారు, సింగరేణి లాభాల తర్వాత తీసుకుంటున్న చర్యలు ఆ కంపెనీ భవిష్యత్తుకు బాటలు వేయాలని భావిస్తున్నది సింగరేణి పరిరక్షణతో పాటు కార్మిక సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నది, మిగతా లాభాలను గత సర్కారుకు భిన్నంగా మళ్ళీ కార్మిక సంక్షేమం కోసమే ఖర్చు చేయడంలో భాగంగా సింగరేణి బొగ్గు ఉత్పత్తి విస్తరణకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంస్థ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నదని, సెక్రెటరీ జనరల్ జన ప్రసాద్ ప్రెస్ మీట్ లో కూడా వివరంగా తెలియజేయడం జరిగింది, అదేవిధంగా వి కే ఓ సి పి అతి త్వరలో వస్తుందని, ఆశాభవాన్ని వ్యక్తం చేస్తూనే , కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా,కార్మికుల హక్కుల పై రాజీలేని పోరాటం చేస్తున్న యూనియన్ ఐ ఎన్ టి యుసి అని , మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ మెంబర్ ఆల్బర్ట్, బూటుక రాజేశ్వరరావు, జిదుల రాజేశ్వరరావు, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్కే గౌస్, స్టోర్ ఫిట్ కార్యదర్శి కే నట్రాజ్, బ్రాంచ్ కార్యదర్శి ఎం.అశోక్, ఆర్గానిక్ సెక్రెటరీ ఐమన్స్, బిక్షపతి, తిరుపతి, అసిస్టెంట్ సెక్రటరీ చందులాల్, యాకువుద్దీన్,సముద్రాల శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, రహీం,గోగ్గల శ్రీనివాస్, గోవర్ధన్, చంద్ర శేఖర్, బింగి గోపాల్, కాజా పాషా, ప్రవీణ్ కుమార్, మహేశ్వరరావు, బండి సంపత్, చంద్రశేఖర్, ప్రభాకర్, ఎండి గౌస్, అంకుష్, కృష్ణ, వేణు, టిఆర్ఎస్ రాజు ,సముద్రాల శ్రీనివాస్ ,సలిగంటి శ్రీనివాస్, శ్రీకాంత్ శర్మ, నరేష్, సమ్మయ్య, జివెల్ శ్రీనివాస్, హరీష్, నర్సింగరావు నర్సింగరావు, కళ్యాణ్, బాబర్ భాష, ఎల్లయ్య, కనకయ్య,రామకృష్ణ, పద్మావతి, స్పందన, వాసంతిక,నాయకులు కార్యకర్తలు, ఉద్యోగులు,మిత్రులు శ్రేయోభిలాషులు సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version