📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 487,585  |  579 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు

కారేపల్లి గిరిజన గురుకుల పాఠశాలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

August 13, 2024 August 13, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

కారేపల్లి మండలంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలను ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.వసతి గృహంలో సౌకర్యాలు,ఆహారంపై పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ అధికారుల బృందం ఉదయం 6 నుంచి తనిఖీలను ప్రారంభించారు.తరగతి గదులు పరిశుభ్రంగా లేవని, గదుల్లో విద్యార్థులకు సరిపడా ఫ్యాన్లు లేవని ఏసీబీ అధికారులు గుర్తించారు.గురుకులంలో నిర్వహణ సక్రమంగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తనిఖీ బృందం గుర్తించడంతో పాటు వివరాలను విలేకరులకు కూడా వెల్లడించారు.ఉన్న ఇబ్బందులను సరి చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందనీ తనిఖీ బృందం చేపట్టిన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *