📰
PressMeet App – Latest Telugu News తాజా వార్తలు మీ చేతిలో – Download Now!
Tuesday, April 28, 2026
Visitors: 486,389  |  503 Online
Breaking
Latest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలుLatest Breaking News from PressMeetతాజా వార్తలుకొత్తగా రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం: ప్రధాని మోదీ కీలక ప్రకటనవాట్సప్ సరికొత్త క్లౌడ్ బ్యాకప్ ఫీచర్: యూజర్లకు స్టోరేజీ ఊరటకొలంబియా హిప్పోల రక్షణకు అనంత్ అంబానీ ముందడుగుమెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం: 15 మంది ప్రయాణికులకు గాయాలుడిజిటల్ అరెస్ట్ మోసాల కట్టడికి కేంద్రం కీలక ప్రతిపాదనలు

రేషన్ దొంగలపై పిడి యాక్ట్ పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ DT మాచన రఘునందన్

July 13, 2024 July 13, 2024 0 Views
TwitterWhatsAppFacebookTelegramShare

రేషన్ బియ్యం ను అక్రమంగా తరలించి, రైస్ మిల్లులకు,పౌల్ట్రీకి అమ్ముతున్న వాళ్ళపై పీడి యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం ఖాయం అని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు.శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదలుకుని జులై నెల వరకు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదైన రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసుల సంఖ్యను గమనిస్తే కొందరు అదే పనిగా రేషన్ బియ్యం “దందా” చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు.కొన్ని రైస్ మిల్లులు రేషన్ బియ్యం కొనడమే దందా గా పెట్టుకున్నoదుకే నెలకు 5,6 కేసులు ఆయా పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదు అవుతున్నాయని అన్నారు.అందుకే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ 2 మార్ల కంటే ఎక్కువ పట్టు బడితే పిడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడం ఖాయం అని రఘునందన్ స్పష్టం చేశారు.జనం రేషన్ బియ్యం తినక పోతే తీసుకోకపోవడం మంచిదని సూచించారు. అంతే తప్ప అలా రేషన్ తీసుకుని, ఇలా..అమ్మేస్తుంటేనే రేషన్ అక్రమ రవాణా కేసులు అధిక సంఖ్యలో ఉన్నాయని అన్నారు. రేషన్ అక్రమ దందా చేస్తే ఆయా డీలర్ల డీలర్ షిప్ రద్దు చేసేందుకు వెనకాడే ప్రసక్తే లేదని రఘునందన్ హెచ్చరించారు.

Loading

మరిన్ని వార్తలు | More News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *