Saturday, March 14, 2026
f t y in
Breaking
Advertisement 728×90
Andhra

నేడు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

TwitterWhatsAppFacebookTelegramShare

సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆయనతోపాటు రాష్ట్ర […]

Loading

TwitterWhatsAppFacebookTelegramShare

సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. అనంతరం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఆయనతోపాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీకే జనార్దన్ రెడ్డి తదితరులున్నారు. విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థికసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు తోడ్పాటు,మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని పారిశ్రామిక రాయితీలు తదితర హామీల అమలులో ప్రధాని, సంబంధిత మంత్రిత్వ శాఖల మంత్రులతో చంద్రబాబు సహకరించాలని కోరే అవకాశం ఉంది. మరియు.అదనంగా, దేశ ఆర్థిక పరిస్థితిని నివేదించారు. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి కేటాయింపులు ఉంటాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version