Andhra
Advertisement
Andhra
తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను మంత్రి నారా లోకేశ్ నెరవేర్చారు. సీతానగరం మహానాడు వద్ద రూ. 294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దిగువన 0.900 కి.మీ నుండి 2.610 కి.మీ వరకు ఈ గోడను నిర్మించనున్నారు. ఎన్నికల హామీ మేరకు మంత్రిమండలి ఆమోదంతో చేపట్టిన ఈ పనుల వల్ల నదీ పరివాహక ప్రాంత ప్రజలకు వరద ముప్పు తప్పనుంది.
![]()
Advertisement
