Articles by admin
Advertisement
Uncategorized
సీతారాం ఏచూరి మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
TG: వామపక్ష యోధుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలుగు జాతికి సీతారాం గారి ప్రస్థానం ప్రత్యేకమని, నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో వారు చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని సీఎం అభిప్రాయపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముఖ్యమంత్రి, ఏచూరి గారి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు.
![]()
Advertisement
