కూకట్పల్లి జోన్ మూసాపేట్ సర్కిల్ కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి రూ. 18,000 లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు చిక్కారు. మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, లక్షకు వెయ్యి రూపాయల చొప్పున ఆయన ఈ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు మురళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 ద్వారా సంప్రదించాలని అధికారులు కోరారు.
![]()
